Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 July 2025, 11:15 am Posted by : ramakrishna

బెట్టింగ్ యాప్స్ కేసులో హీరో విజయ్ దేవరకొండకు ఈడీ నోటీసులు

 హైదరాబాద్, బతుకమ్మ :  బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణను వేగవంతం చేసింది. ఈక్రమంలో సినీ నటుడు హీరో విజయ్ దేవర్ కొండకు ఆగస్టు 11న విచారణకు హాజరుకావాలని ఈడీ మరో నోటీసులు ఇచ్చింది. ఇదే కేసులో ప్రకాశ్ రాజ్ ను జూలై 30న, నటి మంచు లక్ష్మిని ఆగస్టు 13 విచారణకు రావాలని ఈడీ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. ఇప్పటికే విచారణకు సమయం కావాలని నటుడు దగ్గుబాటి రానా కోరారు.