Batukammanews
Newspaper Banner
Date of Publish : 08 August 2025, 7:52 pm Posted by : ramakrishna

శ్రీ చైతన్య పాఠశాలలో ముందస్తు రక్షా బంధన్

  • బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మార్పు దయాకర్ రెడ్డి

 

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాలలో బిజెవైఎం మండల ప్రధాన కార్యదర్శి మార్పు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ముందస్తు రక్షా బంధన్ వేడుకలు గణంగా నిర్వహించారు.పాఠశాల విద్యార్థులకు, బిజెవైఎం నాయకులకు విద్యార్థినులు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా విద్యార్థులు,బి జె వై ఎం నాయకులు ఒకరి కొకరు నీకు నేను రక్షా నాకు నువ్వు రక్షా  మనిద్దరం దేశానికి రక్షా, ధర్మానికి రక్షా అంటూ ప్రతిజ్ఞ చేశారు.  ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల ప్రధాన కార్యదర్శి మార్పు దయాకర్ రెడ్డి,ప్రశాంత్, నవీన్, వినయ్ రెడ్డి, చందు, నిమ్మల సాయి, రమేష్ మాచర్ల, రాకేష్ యాదవ్, ప్రశాంత్, కార్యక్రమంలో పాల్గొన్నారు.

Early Raksha Bandhan at Sri Chaitanya School