రుద్రూర్, బతుకమ్మ : అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో మండల మాలల సంఘం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారుజామున నాయకులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో మాల సంఘ నాయకులు కిశోర్, సంజీవ్ తదితరులు ఉన్నారు.