బీర్కూర్ ఏఎంసీ చైర్ పర్సన్ గా దుర్గం శ్యామల
బీర్కూర్, బతుకమ్మ: బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా నస్రుల్లాబాద్ మండలం దుర్కి గ్రామానికి చెందిన మాజీ మండల అధ్యక్షురాలు, మాజీ సర్పంచ్ దుర్గం పల్లి శ్యామల నియమితులయ్యారు. త్వరలో పూర్తిస్థాయి పాలకవర్గాన్ని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించనున్నారు. ఉమ్మడి బీర్కూర్ మార్కెట్ యార్డ్ కు రొటేషన్ పద్ధతిలో ఒక టర్మ్ నస్రుల్లాబాద్, మరో టర్మ్ బీర్కూర్ కు చైర్మన్ పదవి కేటాయిస్తూ వస్తున్నారు.