బకాయిలు విడుదల చేయించాలి

పీసీసీ అధ్యక్షుడిని కోరిన ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు   నిజామాబాద్, బతుకమ్మ : ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయించాలని పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని  ప్రైవేట్ డిగ్రీ కళాశాలల యాజమాన్యాల బృందం కోరింది. గత మూడు సంవత్సరాలుగా  ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విడుదల కాకపోవడంతో కాలేజీల నిర్వహణ కష్టంగా మారిందని కాలేజీల యాజమాన్యాలు ఆయన దృష్టికి తీసుకొని వచ్చాయి. వేల మంది విద్యార్థులు ఉచితంగా చదువుకుంటున్న ప్రైవేటు డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో అటు విద్యార్థులు...