మత్తు జీవితాలు చిత్తు
మోర్తాడ్, బతుకమ్మ: మత్తు పదార్థాలకు బానిసైతే జీవితాలు చిత్తుకాగితాలుగా మారతాయని అలా కాకుండా జీవితంలో ఉన్నత లక్ష్యంతో చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడాలని గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు సంతోష్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండలంలోని సుంకేట్ గ్రామంలో శుక్రవారం మోర్తాడ్ పోలీస్ ఆధ్వర్యంలో డ్రగ్స్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. విద్యార్థులు ఎటువంటి మారకద్రవ్యాలకు అలవాటు కాకుండా చూసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ పోశెట్టి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.