Batukammanews
Newspaper Banner
Date of Publish : 15 April 2025, 7:40 pm Posted by : ramakrishna

తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో డ్రోన్‌ కెమెరా కలకలం

తిరుమల, బతుకమ్మ : తిరుమల శ్రీవారి ఆలయ పరిసరాల్లో డ్రోన్‌ కెమెరా కలకలం రేపింది. రాజ స్థాన్ కు చెందిన ఓ యూట్యూబర్ మంగళవారం దాదాపు 10 నిముషాలపాటు డ్రోన్ కెమెరాను వినియోగించినట్టు అధికారులు తెలిపారు. స్పందించిన టీటీడీ విజిలెన్స్ అధికారులు అతడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన దశ్యాలను పరిశీలిస్తున్నారు. తిరుమలలో ఆవ్యక్తి మంగళవారం ఉదయం నుంచి వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు గుర్తించారు.