Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 8:23 pm Posted by : ramakrishna

పంచాయతీలలో ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల

నిజామాబాద్, బతుకమ్మ : జిల్లా ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఆధారంగా జిల్లా ఎన్నికల అధికారి వినయ్ క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో 31మండలాల్లోని 545 గ్రామ పంచాయతీలకు 5022వార్డుల యొక్క ఓటర్ల ముసాయిదా జాబిత విడుదలైంది. జూలై 1న గ్రామ పంచాయతీ, వార్డలు వారీగా ఓటర్ల జాబిత పోలీంగ్ స్టేషన్ ల జాబితాను రూపొందించిన విషయం తెలిసిందే. వాటిని ఆగస్టు 28న అన్ని గ్రామ పంచాయతీలలో ప్రదర్శించారు. వాటిలోని అభ్యంతరాలను ఆగస్టు 30 వరకు స్వీకరించి 31వరకు పరిష్కరించారు. తుది ముసాయిదా ఓటర్ల జాబితాలను అన్ని మండల పరిషత్, గ్రామ పంచాయతీ కార్యాలయాలలో పొందుపరిచారు.