నూతన జంటను ఆశీర్వదించి బాధితులను పరామర్శించిన డా.మల్లికార్జున్ రెడ్డి
వేల్పూర్, బతుకమ్మ : మండలంలోని పచ్చలనడుకుడ గ్రామానికి చెందిన నూతన వధూవరులను బాల్కొండ కానిస్టెన్సీ బీజేపీ ఇంచార్జ్ డాక్టర్. ఏలేటి మల్లికార్జున్ రెడ్డి మంగళవారం ఆశీర్వాదించారు. అనంతరం గ్రామంలోని పలు భాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి, కుటుంబ సభ్యులకు దైర్యం నింపారు. ఆయన వెంట పార్టీ మండల్ ప్రెసిడెంట్ బేల్దారి నవీన్, జనరల్ సెక్రటరీ లాభిషేట్టి భానుచందర్, సతీష్, నిమ్మల పెద్దన్న,వళ్ళం రవి, పోతుల బాలకిషన్, కృష్ణారెడ్డి, గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.