జడ్పీహెచ్ఎస్ పాఠశాలకు టేబుల్స్ విరాళం

  రుద్రూర్ (వర్ని), బతుకమ్మ :   వర్ని మండలం శ్రీనగర్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యార్థుల కొరకు మాదాల చారిటబుల్ ట్రస్ట్ (సీసీడి) ఆధ్వర్యంలో సోమవారం టేబుల్స్ ని విరాళంగా అందించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు,  మాదాల చారిటబుల్ ట్రస్ట్ జనరల్ మేనేజర్ ఠాగూర్, బోధన్ కమ్మ సంఘం అధ్యక్షులు శివన్నారాయణ,  జెడ్పి హెచ్ ఎస్ హెచ్ఎం, అశోక్, శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ మద్దిపాటి పూర్ణిమ కిరణ్,  ఉప సర్పంచ్ విశ్వనాథం, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.