Batukammanews
Newspaper Banner
Date of Publish : 22 March 2026, 5:50 pm Posted by : ramakrishna

చింతమణి పల్లిలో కుక్కల స్వైర విహారం

 

కామారెడ్డి, బతుకమ్మ :

 

కామారెడ్డి జిల్లా లోని దోమకొండ మండలంలోని చింతమణి పల్లి లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోడ్డు మీద కనబడితే చాలు దాడులకు పూనుకుంటున్నాయి. ఆదివారం రోడ్డుపై ఆడుకుంటున్న హర్షిని, జాహ్నవి అనే ఇద్దరు చిన్నారులపై కూడా కుక్కలు దాడి చేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో చిన్నారులను కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కానీ హర్షిని కి కంటి వద్ద గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు.

Dogs roaming freely in Chintamani Palli