- 9 జీవాలు మృతి
బతుకమ్మ భిక్కనూరు: గొర్రెల మందపై కుక్కల దాడి చేయగా తొమ్మిది జీవాలు మృతి చెందిన ఘటన భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే తలమడ్ల రోడ్డు సమీపంలో కడారి ఎల్లయ్య మేకల మందను పెట్టాడు . వీధి కుక్కల దాడిలో 9 జీవాలు మృతి చెందడంతో గొర్రెల కాపరి కడారి ఎల్లయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆర్ఐ బాలయ్య సంఘటన స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.
