రుద్రూర్, బతుకమ్మ :
రుద్రూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి రాజశ్రీ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ప్రసవాల గది, ప్రయోగశాల, మందుల పంపిణీ విభాగాలను పరిశీలించి రికార్డులను తనిఖీ చేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో నిర్లక్ష్యం వహించవద్దని సిబ్బందిని ఆదేశించారు. ఈ తనిఖీలో వైద్యాధికారిణి అయేషా సిద్దిక, సూపర్వైజర్ రవి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.