Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 May 2026, 7:50 pm Posted by : ramakrishna

ఇందిరమ్మ ఇళ్ళను తనిఖీ చేసిన డిఎల్పిఓ

 

భిక్కనూరు, బతుకమ్మ :

 

భిక్కనూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇండ్లను డిఎల్పిఓ శ్రీనివాస్ మంగళవారం తనిఖీ చేశారు. ఇండ్ల నిర్మాణం ఏ దశలో ఉందో పరిశీలించి పనులు వేగాన్ని పెంచాలని ఎంపిడిఓ రాజ్ కిరణ్ రెడ్డికి సూచించారు. లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి ఇప్పటివరకు జరిగిన వ్యయం ప్రభుత్వం నుండి విడుదలైన నిధులు వంటి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ కర్రోళ్ల రాజు, సెక్రటరీ మహేష్ కుమార్ గౌడ్ లబ్ధిదారులు ఉన్నారు.