Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2025, 6:18 pm Posted by : ramakrishna

డీజేలు నిషేధం : ఎస్సై నవీన్ చంద్ర

జుక్కల్, బతుకమ్మ: జుక్కల్ మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయక ప్రతిష్టించే చోటా డీజే ను ఏర్పాటు చేయరాదని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర హెచ్చరించారు. వినాయక ప్రతిష్టింపే చోట ప్రతి రోజు ముగ్గురు వ్యక్తులు జాగరణ చేయాలని ఆయన అన్నారు. ఏమైనా అయితే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించాలని ఆయన అన్నారు. వినాయక మండపాల వద్ద పేకాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన వినాయక మండపాల వద్ద డీజే పెడితే కఠిన చర్యలుతీసుకుంటామని ఆయన వినాయక మండపాల వద్ద జాగరణ తప్పకుండా చేయాలని అయన అన్నారు. రాత్రి 9 గంటలకే భక్తి పాటలు బందు చేయాలని ఆయన హెచ్చరించారు.