భీంగల్, బతుకమ్మ :
రెండవ మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా భీంగల్ మున్సిపల్ పరిధిలోని స్థానిక ఎంపీడీఓ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని డిస్ట్రిక్ట్ జనరల్ అబ్జార్వర్ సీ. హెచ్ సత్యనారాయణ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఇందులో భాగంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను పరిశీలించిన ఆయన నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన మీదట స్వీకరించాలని సూచించారు. నామినేషన్ సెంటర్లో రోజు వారి నామినేషన్లు ఇతరత్ర వివరాలను రిటర్నింగ్ ఆఫీసర్ ను అడిగి తెలుసుకొన్నారు. ఆయన వెంట తహసీల్దార్ షబ్బీర్, మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్ లు ఉన్నారు.