Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 January 2026, 6:54 pm Posted by : ramakrishna

ఎంపీడీవో అనంతరావుకు జిల్లా స్థాయి అవార్డు

ఇందల్వాయి, బతుకమ్మ :

 

గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన మండల పరిషత్ అభివృద్ధి అధికారి అనంతరావుకు ఇలా త్రిపాఠి చేతుల మీదగా అవార్డు అందజేశారు. 40 మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పేద ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడంతో మండల ప్రజలకు చేరువయ్యారు. దీంతో జిల్లా కలెక్టర్ ఈలా త్రిపాఠి సోమవారం ఉత్తమ ఎంపీడీవో అవార్డును అందజేశారు. అలాగే ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో ఎస్సై జి.సందీప్, పోలీస్ కానిస్టేబుల్ ప్రశాంత్ కు విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు అవార్డులు అందించారు.

 

District level award for MPDO Ananth Rao