Batukammanews
Newspaper Banner
Date of Publish : 01 December 2024, 7:15 pm Posted by : ramakrishna

జిల్లాస్థాయి అథ్లెటిక్స్ మాస్టర్ సెలక్షన్స్

నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : డాక్టర్ శ్రీను నాయక్ డెంటల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలోని పాలిటెక్నిక్ గ్రౌండ్లో  జిల్లా స్థాయి అట్లాటిక్స్ మాస్టర్ సెలక్షన్స్ నిర్వహించారు. 5k నడక, 100 మీ పరుగు, డిస్కస్ త్రో, షార్ట్ పుట్, లాంగ్ జంప్ క్రీడా పోటీలను మెన్ అండ్ ఉమెన్ కి నిర్వహించారు. డొంకేశ్వర్ మండలంలోని ఎంపీపీ ఎస్ తొండకూర్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ వరలక్ష్మి 55+ ఏజ్ క్యాటగిరిలో  5Kవాక్ లో,  100మీ.పరుగు పందెం, డిస్కస్ త్రో పోటీలలో పాల్గొని ద్వితీయ స్థానంలో నిలిచి 3వెండి పతకాలు సాధించారు. ముఖ్య అతిథిగా నాగయ్య ఏసీపీ హాజరై బహుమతులను విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంఏఏ రాష్ట్ర అధ్యక్షులు మర్రి లక్ష్మణ్ రెడ్డి,  ఉపాధ్యక్షులు ప్రభు కుమార్,  ఆర్గనైజింగ్ సెక్రటరీ కిరణ్ న్యూరో డాక్టర్ గోపికృష్ణ, జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ సభ్యులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.