Batukammanews
Newspaper Banner
Date of Publish : 16 April 2026, 8:01 pm Posted by : ramakrishna

వేం నరేందర్ రెడ్డికి అభినందనలు తెలిపిన జిల్లా నాయకులు

 

వెబ్ డెస్క్, బతుకమ్మ :

 

రాజ్య సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వేం నరేందర్ రెడ్డి ని నిజామాబాద్ జిల్లా నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. గురువారం ఢిల్లీ లోని తెలంగాణ భవన్ లో ఆయనని కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి, రాష్ట్ర మైనారల్ డెవలప్మెంట్ చైర్మన్ ఈరావత్రి అనిల్, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఆర్మూర్ ఇన్ చార్జి వినయ్ రెడ్డి, మునిపల్లి సాయిరెడ్డి, బాసా వేణు గోపాల్ యాదవ్ లు పాల్గొన్నారు.