కాకతీయ రజినీకాంత్ ను సన్మానించిన జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల 

నిజామాబాద్, బతుకమ్మ ; నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రముఖ కాకతీయ విద్యా సంస్థ ల అధినేత సిహెచ్ రజనీకాంత్ ను జిల్లా న్యాయమూర్తి సునీత కుంచాల, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు శనివారం సన్మానించారు. నిజామాబాద్ జిల్లాలో అనాధ(మానవత సదన్) పిల్లలను  ప్రముఖ విద్యాసంస్థల్లో ఒకటైన కాకతీయ లో ఉచితంగా విద్య బోధన చేస్తున్నందుకు గాను  సన్మానించారు. కాకతీయ విద్యాసంస్థల అధినేత రజినీకాంత్ తో పాటు ప్రిన్సిపాల్ రణదీశ్ ను సన్మానించారు. సన్మానించిన వారిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఉన్నారు.