Batukammanews
Newspaper Banner
Date of Publish : 25 August 2025, 5:44 pm Posted by : ramakrishna

గణేష్ విగ్రహాల పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

కామారెడ్డి, బతుకమ్మ : వినాయక చవితి పండుగను పురస్కరించుకొని ఈ సంవత్సరం, పర్యావరణం పై అవగహన కల్పించేందుకు. మట్టి గణేష్ విగ్రహాల గురించి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు రూపొందించిన పోస్టర్లను సోమవారం కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.  ఈ సందర్భంగా పర్యావరణానికి అనుకూలమైన మట్టి విగ్రహాలను ఎర్పాటు చేసుకోని పర్యావరణాని కాపాడుకునే బాధ్యత మన అందరిపై ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాలలొ భాగాంగ 8 అంగుళాల మట్టి గణపతి లను అందించి పర్యావరణం పై పెద్ద ఎత్తున అహగహన కార్యక్రమాలు టీజీపీసీబీ  నిర్వహంచడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. అవగాహన కార్యక్రమాలలొ బాగంగా రాష్ట్ర వ్యాప్తం గా పర్యావరణ గణేష్ పోస్టర్ల ప్రదర్శన ద్వారా ప్రచార కార్యక్రమాలు చేపట్టి  చెరువుల్లో మట్టి మేటలని  తొలిగించటానికి  చెరువులో స్వచ్ఛత   కాపాడటానికి వినాయక చవితి సందర్బంగా ప్రజలు భక్తులు నడుము బిగించాలాని మట్టి తో వినాయక విగ్రహాలు తాయారు చేసి భక్తితో చెరువులోకి చేర్చొచ్చని ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.