Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 September 2025, 5:23 pm Posted by : ramakrishna

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్

నిజామాబాద్ సిటీ,బతుకమ్మ : శ్రీ ఓం గణేష్ మండలి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన అన్నదాన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య హాజరయ్యారు.  మొదట పూజా కార్యక్రమం అనంతరం

District Collector and Police Commissioner participated in the food distribution program.

“అన్నదాన కార్యక్రమం” లో పాల్గోని వచ్చినటు వంటి వారికి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ అన్నదాన కార్య క్రమంలో పెద్ద మొత్తంలో స్నేహా సొసైటీ విధ్యార్దులు , మరియు పోలీస్ సిబ్బంది, సామన్య ప్రజలు హారయ్యారు. ఈ కార్యమ్రం లో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, మున్సిపల్ కమిషనర్  దిలిప్, అదనపు డి.సి.పి (అడ్మిన్) జి.బస్వా రెడ్డి , రాజశ్రీ , ఫిషారీస్ శ్రీ ఆంజనేయులు , నిజామాబాద్ టౌన్ ఏసిపి రాజా వెంకట్ రెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ ,  రిజర్వు ఇన్స్పెక్టర్స్ లు , ఆర్.ఎస్.ఐలు , ఏ.ఆర్ హెడ్ క్వార్టర్ సిబ్బంది, రేంజ్ కార్యాలయం సిబ్బంది , పోలీస్ కార్యాలయం సిబ్బంది , పోలీస్ గణేష్ మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

District Collector and Police Commissioner participated in the food distribution program.