కళాశాలలో పాఠ్యపుస్తకాల పంపిణీ

బతుకమ్మ, పిట్లం : పిట్లం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం  అసద్ ఫరూఖ్ పాఠ్య పుస్తకాలను  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థిని, విద్యార్థులు బాగా చదువుకొని రాణించాలని ,కళాశాలకు కన్న తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు,సిబ్బంది పాల్గొన్నారు.