రాజంపేట,బతుకమ్మ : ఇండియన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఎన్జీవోసంస్థ ఆధ్వర్యంలో స్కూలు విద్యార్థులకు శనివారం బ్యాగులను పంపిణీ చేశారు. రాజంపేట మండలంలోని తలమడ్ల ప్రాథమిక పాఠశాల ఏం పి పి యెస్ విద్యార్థులకు స్కూల్ బ్యాగ్లతో పాటు నోట్ బుక్స్, డ్రాయింగ్ బుక్ ,జామెటరీ బాక్స్ ,కలర్ పెన్సిల్స్ ,స్లీట్ పెన్నులు ఒక సంవత్సరమునకు సరిపడ మెటీరియల్ పంపిణీ చేశారు. పాఠశాల విద్యార్థులకు స్టడీ మెటీరియల్ను అందించిన ఇండియన్ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఎన్జీవోసంస్థ ప్రతినిధులకు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలొ ఐడీఎఫ్ ప్రతినిధులు సంజయ్, రమ , రాజేష్, నాగరాజు , ఎంఈఓ పూర్ణచంధర్, కాంప్లెక్స్ హెచ్ఎం ఈశ్వర్, పాఠశాల సిబ్బంది, హెచ్ఎం రమేష్ కుమార్ , కవిత , గంగమోహన్, దుర్గాప్రసాద్, గ రజిత తదితరులు పాల్గొన్నారు.
