నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జూన్ 28వ తేదీ నిర్వహిస్తున్న జాతీయ పోలియో దినోత్సవ కార్యక్రమం లో భాగంగా చిన్నారులకు పోలియో చుక్కల మందు వేసిన తర్వాత మార్కింగ్ చేసేటువంటి 1100 మార్కర్ పెన్నులను రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రాజశ్రీ కి అందజేసినట్లు రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ బుస్సా ఆంజనేయులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ సుమంత్ కుమార్, రాష్ట్ర ఎంసీ కమిటీ మెంబర్ తోట రాజశేఖర్, జిల్లా కోశాధికారి కలిపి రవీందర్, మోపాల్ మండల్ చైర్మన్ ఘనపూర్ వెంకటేశ్వర్లు, డిపిఎం సుధాకర్ పాల్గొన్నారు.