కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ

బతుకమ్మ, భిక్కనూరు: భిక్కనూరు పట్టణ కేంద్రంలోని రైతు వేదిక కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే  కాటిపల్లి వెంకట రమణారెడ్డి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకొని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ సునీత, ఎంపీడీవో రాజ్ కిరణ్ రెడ్డి, ఆర్ఐ బాలయ్య, పంచాయతీ కార్యదర్శి మహేష్ గౌడ్, బిజెపి జిల్లా నాయకులు రమేష్ రెడ్డి, మండల అధ్యక్షులు రమేష్, లబ్ధిదారులు, తదితరులు ఉన్నారు.