Batukammanews
Newspaper Banner
Date of Publish : 30 October 2025, 2:55 pm Posted by : ramakrishna

గోశాలకు గడ్డి వితరణ

రుద్రూర్, బతుకమ్మ : బాన్సువాడ నియోజకవర్గ బిజెపి నాయకులు, ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ రుద్రూర్ గోశాలకు బుధవారం 101 మోపుల గడ్డి వితరణ చేశారు. బాన్సువాడ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ చేస్తున్న సేవలు అభినందనీయమని బిజెపి పార్టీ మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.