బతుకమ్మ పిట్లం : పిట్లం మండలం వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రాంగణంలో జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ,ఏ. ఎమ్. సి. చైర్మన్ మనోజ్ ఆధ్వర్యంలో పిట్లం మండల మత్స్యకారులకు సోమవారం చేప పిల్లలను పంపిణీ చేశారు. వైస్ చైర్మన్ ఎంపిడిఓ., ఎఫ్డి ఓ. డోలీసింగ్ ఆధ్వర్యంలో శాసన సభ్యులు లక్ష్మీ కాంతారావు ఆదేశాల మేరకు పిట్లం మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల మత్స్యకార సంఘాల కు బొచ్చ, రౌట మృగాల,బంగారు తీగ వంటి రకాల చేప పిల్లలు పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏఎంసి వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి,పి. ఏ. సి. ఎస్.చైర్మన్ శపథం రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంబింగ్ హ్యన్మండ్లు ,మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి, జిల్లా డైరెక్టర్లు పిట్లం దత్తు,పుల్కంటీ మైసబోయి ఎర్ర సాయిలు,నర్సింలు జయశ్రీ సాయిలు,స్థానిక సంఘాల సభ్యులు నాయకులు అధికారులు పాల్గొన్నారు.
