Batukammanews
Newspaper Banner
Date of Publish : 02 April 2025, 6:13 pm Posted by : ramakrishna

రేషన్ లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ

బతుకమ్మ, ఏర్గట్ల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుకగా పేదలకు సన్నబియ్యాన్ని అందిస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన హామీని నిజం చేసినందుకు ఏర్గట్ల మండల కేంద్రంలో ప్రభుత్వ చౌక ధరల షాప్ వద్ద గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి లబ్ధిదారులకు సన్నబియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ల శివకుమార్, గ్రామ అధ్యక్షుడు రేండ్ల రాజారెడ్డి, ఏలేటి మోహన్ రెడ్డి, గడ్డం జీవన్ రెడ్డి, బద్దం జితేందర్ రెడ్డి, రోక్కెడ చిన్న సాయన్న, కూరాకుల బోర్రన్న, ముస్కు మోహన్ రెడ్డి, బద్దం లింగారెడ్డి, మునిమాణిక్యం అజయ్, లు పాల్గొన్నారు.