Batukammanews
Newspaper Banner
Date of Publish : 04 October 2025, 5:07 pm Posted by : ramakrishna

హెల్ప్ టు అదర్స్ ఆధ్వర్యంలో నిత్యావసరాల సరుకులు పంపిణీ

 నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :

అమెరికాకు చెందిన శ్రీలత  కోరాడ స్థాపించిన హెల్ప్ టు అదర్స్ ఆధ్వర్యంలో మామిడిపల్లి- ఆర్మూర్ లో గల తపస్వి స్వచ్ఛంద సేవా సంస్థ  చిల్డ్రన్ హోమ్ లో సమకూర్చిన సుమారు  25 వేల  నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. హెల్ప్ టు అదర్స్ ఇండియా ప్రతినిధులు జిలకర లావణ్య, తపస్వి సంరక్షకులు శ్రీనివాస్, కవిత లకు అందచేశారు. లావణ్య మాట్లాడుతూ, పిల్లల కొరకు హెచ్ 2 ఓ వ్యవస్థాపకురాలు కోరాడ శ్రీలత మామిడిపల్లి తపస్వి స్వచ్ఛంద సేవా సమస్త కు నిత్యం వివిధ రకాల సహాయం తో పాటు వారికి తెలిసిన స్నేహితుల ,బంధువుల పుట్టినరోజు, పెళ్లిరోజు సందర్భంగా కూడా భోజన సదుపాయం అందిస్తున్నందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం లో విజయానంద్, గుండు నరేష్ పాల్గొన్నారు