పర్యావరణ రహిత బ్యాగుల పంపిణీ
బాన్సువాడ, బతుకమ్మ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు ఈనెల నుండి సన్న బియ్యంతో పాటు ప్రతి ఒక్కరికి పర్యావరణ రహిత బ్యాగులను పంపిణీ చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు ఆదేశానుసారం మంగళవారం బాన్సువాడ పట్టణంలోని చౌకధరల దుకాణంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు యండి. దావూద్ ఆధ్వర్యంలో తెల్లరేషన్ కార్డు లబ్దిదారులకు ఉచిత బ్యాగులను పంపిణీ చేసారు.