బతుకమ్మ, దుబ్బాక ప్రతినిధి : అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు మిరుదొడ్డి మండలం మల్లు పల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ అర్షద్ కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చిన 17,800/-రూపాయల చెక్కును శనివారం అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మద్దెల రాజేశం, ఉపాధ్యక్షుడు హర్షద్,మాజీ ఎంపీపీ గజ్జల సాయిలు, మల్లు పల్లి గ్రామం మాజీ సర్పంచ్ భూపతి గౌడ్, అల్వాల గ్రామం మాజీ సర్పంచ్ ఎనగంటి కిష్టయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భూమా గౌడ్, చెన్నై భూపాల్ గౌడ్ మహేష్, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు మహమ్మద్ జహంగీర్,నరేష్ , రామకృష్ణ , టీజేఎస్ రాజిరెడ్డి, మహేందర్ రెడ్డి, నెరేటి రాజు, విజయపాల్ రెడ్డి, సోలిపేట ప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు.