నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎంఆర్ఎఫ్ చెక్కులను సోమవారం అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పంపిణీ చేవారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతు వివిధ కారణాలతో అనారోగ్యంతో బాధపడి చికిత్స చేసుకున్న బాధితులకు సీఎం సహాయ నిధి గల చెక్కులు అందజేశామని తెలిపారు. ఇప్పటివరకు ఎక్కువ మొత్తం సీఎంఆర్ఎఫ్ చెక్కులు అర్బన్ నియోజకవర్గనికి రావడం జరిగిందని అన్నారు. ఎటువంటి జాప్యం లేకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి సెక్రటరేట్ కి పంపించడం జరుగుతుందని అన్నారు.
