సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
బతుకమ్మ,బాల్కొండ: బాల్కొండ మండల కేంద్రంలో గురువారం గ్రామ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 20 మంది బాధిత లబ్ధిదారుల కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పార్టీ మండల అధ్యక్షులు ముస్కు భూమేశ్వర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిదారులకు మంజూరు అయిన చెక్కులను అందజేసారు.ఈ సందర్భంగా లబ్ధిదారులు మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు బద్దం నర్సారెడ్డి, కట్ట మహేష్, టి.సాయన్న, సాయిలు, జక్కుల...