బతుకమ్మ దుబ్బాక ప్రతినిధి : లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను శనివారం దుబ్బాక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి అందజేశారు. అర్హులైన లబ్ధిదారులు సీఎం రిలీఫ్ ఫండ్ ను మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దుబ్బాక కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మండల, పట్టణ కేంద్ర పరిధిలోని పరిధి లోని మున్సిపాలిటీకి చెందిన కారంపూరి వజ్రవ్వ, 22500/- దుద్దెడ రాజయ్య 60.000/-, మండలలం కంపే భాగ్య,28,500/- ,మెదునూరి మధవి 27,500/-, అవధూత నాగరాజం 44000/-లబ్ధిదారులకు రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళ నాయకురాలు తదితరులు పాల్గొన్నారు.