Batukammanews
Newspaper Banner
Date of Publish : 26 August 2025, 6:14 pm Posted by : ramakrishna

మట్టి గణపతుల పంపిణీ

జుక్కల్, బతుకమ్మ : మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మట్టి గణపతులను తయారుచేసి పంపిణీ చేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గ్రామంలో ప్రజలకు మట్టి గణపతులు ఉపయోగించే విధంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను వినియోగించుకోవాలని అవగాహన సదస్సు నిర్వహించారు. పంచాయతీకార్యదర్శులకు ఎంపీడీవో శ్రీనివాస్ సిబ్బంది మట్టి వినాయకులను ఉపయోగించాలని ఆయన అన్నారు. ధర్మకోల్ తో తయారుచేసిన వినాయకులను ఉపయోగిస్తే కాలుష్యం వస్తుందని అందుకే మట్టి వినాయకులను వినియోగించాలని ఆయన అన్నారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మట్టి వినాయకులను తయారుచేసి పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము, సీనియర్ అసిస్టెంట్ మధుసూదన్, గ్రామపంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.