బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన నాలుగురు లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిది చెక్కులను అందజేశారు. లబ్ధిదారులు మాట్లాడుతూ మా కుటుంబ సభ్యులకు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటల్ లో చికిత్స చేసుకున్న విషయాన్ని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ద్వార తెలంగాణ మినరల్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, కోపరేటివ్ యూనియన్ చైర్మన్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో ఏర్గట్ల మండల వర్కింగ్ ప్రెసిడెంట్ రెండ్ల రమేష్,రొక్కెడ సంజీవ్, కాంగ్రెస్ పార్టీ మండల మైనార్టీ అధ్యక్షుడు మునీర్, తుపాకుల శ్రీనివాస్ గౌడ్, జుంగల బిగ్ బాస్, దమ్మున్నోళ్ళ శ్రీనివాస్, సున్నపు అంజయ్య,మహేష్, నరసయ్య,వెంకటేష్, కూరాకుల సాయన్న, జనార్ధన్, గ్రామా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.