బతుకమ్మ, ఏర్గట్ల: మండల కేంద్రానికి చెందిన రుద్రారపు జమునకు, రొక్కెడ సరిత కు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఏర్గట్ల టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు రెండ్ల రాజారెడ్డి బుధవారం అందచేసారు. జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు వైద్యం నిమిత్తం బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని తెలిపారు. వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధుల ద్వారా పేద కుటుంబాలకు చెక్కులను మంజూరు చేపించిన సునీల్ కుమార్ కు గ్రామ కాంగ్రెస్ పార్టీ తరపున లబ్దిదారుల తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రెండ్ల రాజారెడ్డి,కూరాకుల బొర్రన్న, పన్నాల నర్సారెడ్డి,అరపు మాణిక్యం,సూరకంటి చిన్న రాజేశ్వర్,కుశ మోహన్,రేండ్ల ఆశన్న, గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.