ధర్పల్లి, బతుకమ్మ: ధర్పల్లి మండలం దుబ్బాక గ్రామ జిల్లా ఉన్నత పాఠశాలలో ఉల్లాస్ ట్రస్ట్ సంస్థ ఆధ్వర్యంలో దుబ్బాక,చల్లగరగా,మైలారం ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 30 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున చెక్కులు సంస్థ అధినేత యం.అశ్విన్, మండల విద్యాశాఖ అధికారి రమేష్ చేతుల మీదుగా శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్టియు అధ్యక్షులు కే.వెంకట్ రాజారెడ్డి,ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు సైరా సత్యం, ఉపాధ్యాయులు మరియు వి డి సి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.