మెండోరా, బతుకమ్మ :
శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నుంచి ఇందిరమ్మ వరద కాలువ పరిధిలోని ఆయకట్ట కు మంగళవారం యాసంగి పంటకు నీటిని విడుధల చేశారు అధికారులు. మధ్య మనేరు జలాశయం వరకు నీటిని విడుదల చేసినట్లు కార్యనిర్వాహక ఇంజనీర్ చక్రపాణి తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రాజెక్ట్ జలాశయం నుంచి వరద కాలువ ద్వారా 2000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.
