తిమ్మాపూర్ లో గాలి కుంటు టీకాలు

మోర్తాడ్, బతుకమ్మ: పశువైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మోర్తాడ్ మండలంలోని  తిమ్మాపూర్ గ్రామంలో  సోమవారం ఉచిత గాలికుంటూ నివారణ టీకాల కార్యక్రమం నిర్వహించినట్లు పశు వైద్యాధికారి డాక్టర్ గౌతమ్ రాజు అన్నారు. కార్యక్రమంలో భాగంగా  68 పశువులకు (ఆవులు, గేదెలు) ఉచిత గాలికుంటు టీకాలు చేయటం జరిగిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు కుమ్మరి సాయన్న, పిడుగు రాజేందర్, బాణాల రాజేశ్వర్, రమేష్, ప్రభాకర్, ప్రభాస్ తదితరులు  పాల్గొన్నారు.