Batukammanews
Newspaper Banner
Date of Publish : 05 November 2024, 4:47 pm Posted by : ramakrishna

ముగ్గురి ప్రాణాలు కాపాడిన డయల్ 100

బతుకమ్మ,మెండోరా:బాల్కొండ కి చెందిన తన భర్త కేదార్ చిత్రహింసలు పెడుతుండటంతో భరించలేక జీవితంపై విరక్తి చెందిన కుందారపు స్రవంతి (32) తన ఇద్దరు పిల్లలతో కలిసి శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ లో దూకి ఆత్మ చేసుకోవడానికి పాల్పడింది. అక్కడ గమనించిన స్థానికులు 100 నెంబర్ కు కాల్ చేయగా మెండోరా పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని స్రవంతిని పిల్లల్ని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎస్సై నారాయణ ఆమె భర్తను కుటుంబ సభ్యులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు.