హైదరాబాద్, బతుకమ్మ :
తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని మంగళవారం రాష్ట్ర డిజిపి సివి ఆనంద్ మర్యాదపూర్వకంగా కలిసారు. స్పీకర్ అధికార నివాసంలో తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి) గా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ కు స్పీకర్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం స్పీకర్ కి డిజిపి పుష్ప గుచ్చం అందజేశారు. అనంతరం రాష్ట్రంలోని పలు సమస్యలపై కొద్ది సేపు చర్చించారు.
