కొండగట్టుకు పొట్టెత్తిన భక్తులు
మల్యాల, బతుకమ్మ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టుకు హనుమాన్ జయంతి సందర్భంగా భక్తులు భారీగా పొట్టెత్తారు. అంజన్నను దర్శించుకునేందుకు వర్షంలోను కాలినడనక తరలివస్తున్నారు. మాలధారులు దీక్షా విరమణ చేస్తున్నారు. స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో భక్తులు బారులు తీరారు. కాగా, గురువారం తెల్లవారుజామున కొండగట్టులో ఏర్పాట్లను కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.