భక్తులు జాగ్రత్తలు పాటించాలి
మోర్తాడ్, బతుకమ్మ: కార్తీక మాసం కావడంతో గోదావరి పుణ్యస్నానాలు ఆచరించడానికి వస్తున్న భక్తులు జాగ్రత్తలు పాటించాలని మెండోరా ఎస్సై సుహాసిని తెలిపారు. పోచంపాడ్ గోదావరి నది నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నదిలో స్నానం ఆచరించి దీప ఆరాధన చేశారు. భక్తులు పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి నదిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వంటలు చేసుకుని నైవేద్యాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.