Batukammanews
Newspaper Banner
Date of Publish : 19 October 2025, 7:40 pm Posted by : ramakrishna

శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతి కీ గొల్లపల్లిలో ఘన స్వాగతం పలికిన భక్తులు

ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : ధర్మ విజయ యాత్రలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడకు విచ్చేసిన తెలంగాణ లో శృంగేరి జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారీ కి రాచర్ల రఘురామ శర్మ ఆధ్వర్యంలో గొల్లపల్లిలో గీతా మందిరం వద్ద ఘన స్వాగతం పలికిన భక్తులు. రఘురాముల శర్మ మాట్లాడుతూ శృంగేరి పీఠాధిపతులు మన గొల్లపల్లి గీతా మందిరం వద్ద ఆగి భక్తులకు ఆశీర్వచనం ఇచ్చిన సందర్భంగా మన ప్రాంతవాసులు పూర్వజన్మలో చేసుకున్న సుకృతమని తెలిపారు.ఈ కార్యక్రమంలో గీతా మందిరం సభ్యులు,మహిళా భక్తులు, గ్రామస్తులు  తదితరులు పాల్గొన్నారు.