జుక్కల్, బతుకమ్మ: అయ్యప్ప స్వామి ఆశీర్వాదంతో జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్ లో బుధవారం రాత్రి అయ్యప్ప మాలధారులు ఏర్పాటు చేసిన మహాపడిపూజలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మల్లన్న గుట్ట స్వామితోపాటు బొంపెల్లి రాజులు సేట్, మాజీ ఎంపీటీసీ ఇమ్రాన్ ఖాన్, మాజీ సొసైటీ చైర్మన్ రాజు పటేల్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అనిల్ సేట్, మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిగౌడ్ స్వామి, జుక్కల్ మాజీ సర్పంచ్ బొల్లి గంగాధర్ స్వామి, హనుమంత్ స్వామి, ఎల్ఎన్ గౌడ్ అయ్యప్ప స్వామి, కన్నె స్వాములు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
