షెట్ పల్లీ పీహెచ్సీ ని సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

  మోర్తాడ్ బతుకమ్మ :   మోర్తాడ్ మండలం షెట్ పల్లీ గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం డిప్యూటీ డిఎంహెచ్వో రవీందర్ సందర్శించారు. ఆరోగ్య కేంద్రంలోని వ్యాక్సిన్లను, సిబ్బంది హాజరు రిజిస్టర్లను, గదులను, మందులను ఆయన పరిశీలించారు. సీజనల్ వ్యాధులకు ప్రజలు కురికాకుండా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం సద్గుణ, దీప, యం ఎల్ హెచ్ పీ లావణ్య, ఆశా వర్కర్లు సరిత, లత తదితరులు పాల్గొన్నారు.