Batukammanews
Newspaper Banner
Date of Publish : 24 February 2025, 12:58 pm Posted by : ramakrishna

గుండెపోటుతో డిప్యూటీ సీఎం భట్టి పీఏ మృతి

వెబ్ న్యూస్,బతుకమ్మ :  రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీఏ శ్రీనివాస్ గుండెపోటుతో మృతి చెందారు.  గత ఆరు సంవత్సరాలుగా ఆయన భట్టి పీఏగా పని చేస్తున్నారు. భట్టి పీఏ శ్రీనివాస్ మృతిపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఈమేరకు సోమవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. శ్రీనివాస్ ఆత్మకు శాంతి కలగాలని, అతని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.