- తొలి రోజు ఒక ఎకరం వరకు
హైద్రాబాద్, బతుకమ్మ : తెలంగాణ రైతంగానికి రైతు భరోసా నిధుల విడుదల ప్రారంభమైంది. తొలి రోజు 17.03 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి బుధవారం నిధులు జమ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు రైతుభరోసా నిధులు జమా అయ్యాయి. రైతులకిచ్చిన మాట ప్రకారం రేవంత్ ప్రభుత్వం రైతు భరోసా నిధులను నిర్ణీత కాల వ్యవధిలో ప్రారంభోత్సవం నాడు విడుదల చేసిన నిధులతో కలుపుకొని ఈ రోజు వరకు మొత్తం 112654 కోట్లు రైతుభరోసా నిధులు జమ చేశారు.
